పోలీసు కస్టడీలో విడదల రజని మరిది... విచారణ ప్రారంభం

  • ఓ స్టోన్ క్రషర్ కంపెనీని బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసు
  • నిందితులుగా రజని, విడదల గోపి తదితరులు
  • గొల్లపూడి ఏసీబీ కార్యాలయంలో గోపిని విచారిస్తున్న అధికారులు
ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు విడదల రజని మరిది విడదల గోపిని ఏసీబీ అధికారులు ఈ నెల 24న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పల్నాడు జిల్లాలోని ఓ స్టోన్ క్రషర్ కంపెనీని బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో గోపితో పాటు రజని కూడా నిందితులుగా ఉన్నారు. ప్రస్తుతం విజయవాడ జైల్లో గోపి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే, ఈ కేసులో కీలక ఆధారాలను సేకరించేందుకు గోపిని తమ కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టును అధికారులు కోరగా... రెండు రోజుల పాటు కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో విచారించాలని తెలిపింది. 

ఈ నేపథ్యంలో, ఈ ఉదయం గోపిని జైలు నుంచి ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. విజయవాడ జీజీహెచ్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం గొల్లపూడిలోని ఏసీబీ కార్యాలయానికి తీసుకెళ్లి విచారిస్తున్నారు.

Vidala Gopi
AP ACB
Vijayawada Jail
Extortion Case
Palnadu District
AP Minister Vidala Rajani
YCP Leader
ACB Investigation
Crushing Company
Police Custody

More Telugu News